గుంటూరు మేత్రాసనం సహకారంతో క్లారెట్ ధ్యాన బృందం వారు అక్టోబర్ 27 నుండి 29, 2024 వరకు భట్టిప్రోలులోని సెయింట్ క్లారెట్ ధ్యాన ఆశ్రమంలో మరియదళ సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగేలా గృహాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు అన్నారు.
విశాఖ అతిమేత్రాసనం, మల్కాపురం విచారణ, సెయింట్ జోసెఫ్ ది వర్కర్ (St. Joseph the Worker Catholic Church ) దేవాలయం లో మరియదళ వ్యాకులమాత ప్రెసిదియం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి.
గోవా మరియు డామన్ అతి మేత్రాసనం పునీత ప్రాన్సీస్ శౌరి వారి (St Francis Xavier) యొక్క అవశేషాల ప్రదర్శనను ప్రకటించింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ ప్రదర్శన ఈ సంవత్సరం 21 నవంబర్ 2024న ప్రారంభమై 5 జనవరి 2025న ముగుస్తుంది.
విశాఖ అతిమేత్రాసనం, విజయనగరం విచారణ, పునీత అంతోని వారి దేవాలయం లో మరియదళ వరప్రసాదమాత ప్రెసిదియం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. విచారణ కర్తలు గురుశ్రీ లూర్దు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.