వరంగల్ మేత్రాసనం,ఫాతిమానగర్, ఫాతిమా కథడ్రల్ నందు మార్చి 13,2024 న ఫాతిమా మాత 71వ మేత్రాసన వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది .
హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా శ్రేష్ఠులు కార్డినల్ పూల అంథోని, వరంగల్ పీఠకాపరి మహా పూజ్య ఉడుమల బాల మరియు మేత్రాసన గురువులచే సమిష్టి కృతజ్ఞతా బలిపూజ సమర్పించారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మరియు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డా.తాటికొండ రాజయ్య కుడా ఈ పండుగ పూజలో పాల్గొన్నారు.
పునీత సిసిలియా పీఠమండలి గాయకబృందం గురుశ్రీ సురేంద్ర గారి నేతృత్వంలో పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు.
ఉత్తర ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా కోర్టు మార్చి 12న లక్నో డియోసెస్కు చెందిన గురువు గురుశ్రీ డొమినిక్ పింటోతో పాటు మరో 10 మంది ప్రొటెస్టెంట్స్ సహోదరులు కి బెయిల్ మంజూరు చేసింది.
ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 5, 2024న శ్రీలంక, రత్నపుర మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా చిలావ్ కు చెందిన గురుశ్రీ అంతోని వైమన్ క్రూస్ గారిని నియమిస్తూ ప్రకటించారు.
ఆంధ్ర, తెలంగాణ కథోలిక శ్రీసభకు ఎనలేని సేవలు అందించిన అమృతవాణి సికిందరాబాదు లో ఉంది. అక్కడి అమృతవాణి భవనాన్ని నిర్మించి అమృతవాణి కార్యాలయంగా ప్రారంభించి 50 వ సంవత్సరం సందర్భంగా జూబిలీ చిహ్నాన్ని ప్రారంభించారు.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో పాప పశ్చాత్తాప పాద యాత్ర" భక్తియుతంగా జరిగింది. శనివారం ఉ|| 5 గం||లకు వేళాంగణి మాత దేవాలయం నుండి మేరీమాత కొండ గుడి వరకు ఈ పాప పశ్చాత్తాప పాద యాత్ర నిర్వహించారు.
ఫిబ్రవరి 29,2024 న సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నెల్లూరు మేత్రాసనంలోని కనిగిరి విచారణ నందు గురుశ్రీ సిహెచ్ భాస్కర్ గారి సారథ్యంలో, గురుశ్రీ యమ్ హృదయరాజు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చెరసాల పరిచర్య సమన్వయకర్త గురుశ్రీ పసల లహాస్త్రాయ అధ్యక్షతన చెరసాల పరిచర్య మేత్రాసన వార్షిక సమావేశం జరిగింది.
వరంగల్ మేత్రాసనం,మర్రిపెడ విచారణ కర్తలు, పవిత్రాత్మ సభకు (ALCP/OSS) చెందిన గురుశ్రీ మాదాను జాకబ్ గారు 2 మార్చి 2024న ఉదయం 4:30 గంటలకు గుండెపోటుతో మరణించారు.