సూడాన్లో మానవతా సంక్షోభంపై పోప్ లియో ఆందోళన
ఆగస్టు 9 ఆదివారం త్రికాల ప్రార్థన సందర్భంగా పోప్ లియో మరోసారి శాంతి కొరకు తన పిలుపును పునరుద్ఘాటించారు.
సూడాన్, ఉక్రెయిన్ మరియు రష్యాలో తీవ్రతరమవుతున్న సాయుధ ఘర్షణలపై పోప్ ఆందోళన వ్యక్తం చేశారు.
సూడాన్లో యుద్ధం 2023 ఏప్రిల్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ ఘర్షణల వల్ల ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
“సూడాన్లో నెలకొన్న విషాదకర పరిస్థితిని, ముఖ్యంగా el-Obeid నగరంలోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ దేశ ప్రజలందరి పట్ల నా ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేస్తూ, ప్రజలకు మానవతా సహాయ మార్గాలను ఏర్పాటు చేసి, వాటికి హామీ కల్పించాలని అధికారులను మరోసారి కోరుతున్నాను అని పోప్ అన్నారు.
అదే సమయంలో, తక్షణ కాల్పుల విరమణకు దారితీసే ప్రయత్నాలకు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని పోప్ విజ్ఞప్తి చేసారు.
ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంపై కూడా పోప్ లియో స్పందించారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలని, ముఖ్యంగా బలహీనమైన మరియు ప్రమాదంలో ఉన్న ప్రజలను రక్షించాలని పోప్ పిలుపునిచ్చారు.
పునీత డొమినిక్, పునీత ఎడిత్ స్టెయిన్ మరియు పునీత క్లేర్ ఆఫ్ అస్సీసి వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని పోప్ సూచించారు.
వీరు తమకు లభించిన సౌకర్యవంతమైన,సంపన్నమైన జీవితాలను త్యజించి, పునీత ఫ్రాన్సిస్ ప్రతిపాదించిన పేదరికపు ఆదర్శాన్ని స్వీకరించారు.
