అవర్ లేడీ ఆఫ్ గుడ్ కౌన్సెల్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న పోప్
ఇటలీలోని అవర్ లేడీ ఆఫ్ గుడ్ కౌన్సెల్ పుణ్యక్షేత్రాన్ని పోప్ లియో మరోసారి సందర్శించనున్నారు
2025 మే 10న, అంటే పోప్గా ఎన్నికైన కేవలం రెండు రోజులకే, ఆయన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రార్ధించారు.
ఇప్పుడు సెప్టెంబర్ 7న పోప్ మరోసారి ఇక్కడికి రానున్నారు. సెప్టెంబర్ 8న జరగనున్న మరియమాత జనన మహోత్సవ దివ్యబలి పూజకు పోప్ లియో అధ్యక్షత వహించనున్నారు.
ఈ పుణ్యక్షేత్రం ఆగస్టీనియన్ గురువుల ఆధ్వర్యంలో ఉంది.
అవర్ లేడీ ఆఫ్ గుడ్ కౌన్సెల్ పుణ్యక్షేత్రంలో ఒక అద్భుతమైన మరియమాత చిత్రం ఉంది. ఈ చిత్రం 1467లో Albaniaలో ఎటువంటి వివరణ లేకుండా అద్భుత రీతిలో ప్రత్యక్షమైనట్లు విశ్వసిస్తారు.
అప్పటి నుంచి ఈ పవిత్ర చిత్రంపై కతోలికులలో భక్తి క్రమంగా పెరిగింది. ముఖ్యంగా పలువురు పోపులు కూడా ఈ మరియమాతను దర్శించి ప్రార్థనలు చేశారు.
1630లో ఏడవ పోప్ అర్బన్ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో వ్యాధి మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని మరియమాత సహాయాన్ని కోరుతూ ఆయన ప్రార్థించారు. ఈ సందర్శనను ఒక కుడ్యచిత్రం ప్రతిబింబిస్తుంది.
1864లో తొమ్మిదవ పియస్ పోప్ ఇక్కడికి వచ్చి, ప్రథమ వాటికన్ మహాసభ కోసం మరియతల్లి ప్రార్థనలో ఆశ్రయించారు.
1959లో 23వ పునీత జాన్ పోప్ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు రెండవ జాన్ పాల్ పోప్ సందర్శన కూడా కుడ్యచిత్రంలో కనిపిస్తుంది.
ఇప్పుడు, సెప్టెంబర్ 7న పోప్ లియో XIV ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు మరో ప్రత్యేక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
పోప్ లియో తన పోంతిఫికేట్ను మరియతల్లికి ప్రార్థించిన ఆ క్షణాన్ని చిత్రీకరించిన ప్రత్యేక కుడ్యచిత్రాన్ని ఆగస్టీనియన్ గురువులు కానుకగా సిద్ధం చేశారు.
స్థానిక కళాకారుడు మార్కో ఈ కుడ్యచిత్రాన్ని రూపొందించారు. దీనిని పూర్తి చేయడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది.
పోప్ లియో సందర్శన రోజున ఈ ప్రత్యేక కుడ్యచిత్రాన్ని ఆవిష్కరించనున్నారు.
