విశాఖ అతిమేత్రాసనంలో ప్రసిద్ధి గాంచిన "కోడూరుమాత మహోత్సవం" ప్రతి ఏటా సెప్టెంబర్ రెండవ శనివారం జరుగుతుంది. వివిధ ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో భక్తులు కోడూరుమాత ను దర్శించుకుంటారు.ఈ సంవత్సరం సెప్టెంబరు 14 వ తేది కోడూరుమాత మహోత్సవం జరగనున్నది.
ఫ్రాన్సిస్ పాపు గారు ఫిబ్రవరి 27, 2024న కర్నూలు మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా OCD సభకు చెందిన గురుశ్రీ గోరంట్ల జ్వాన్నేసు గారిని నియమిస్తూ ప్రకటించారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ ప్రావిన్స్, మోంట్ఫోర్ట్ సెయింట్ గాబ్రియేల్ సభకు చెందిన బ్రదర్ మర్రెడ్డి తిరుమలరెడ్డి గారు లిస్బన్ లో జరిగిన 17వ ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొన్నారు.