మొదలైన పునీత అంథోనివారి మహోత్సవ వేడుకలు

మొదలైన పునీత అంథోనివారి మహోత్సవ వేడుకలు

విశాఖ అతి మేత్రాసనం, మహారాణి పేట విచారణ  పునీత అంథోని వారి పుణ్యక్షేత్రం లో  నవదిన ప్రార్థనలు 31  మే 2022  న మొదలయ్యాయి.  విశాఖ అతి మేత్రాసన వికార్ జనరల్, మహారాణిపేట విచారణ గురువులు గురుశ్రీ డి బాలశౌరి గారి  ఆద్వర్యం లో ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు పండుగ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ప్రొక్యూటర్ గురుశ్రీ కోన జయరాజు , గురుశ్రీ ప్రతాప్, గురుశ్రీ కె వేలంగాని  రాజు , గురుశ్రీ రవితేజ పాల్గొన్నారు.

 విచారణ ప్రజలతో  పాటూ వివిధ ప్రాతాలనుండి భక్తులు రావడం జరిగినది. యువతీ యువకులు  దేవాలయాన్ని కన్నుల పండుగగా తయారు చేసారు. జూన్ 13 న  పునీత అంథోని వారి పండుగ జరగనున్నది. ప్రజలందరూ  భక్తి శ్రద్ధలతో ఈ నవదిన ప్రార్థనలులో పాల్గొనాలని విచారణ కర్తలు సూచించారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Producer