• యువతా నిరీక్షణా సంకేతాలుగా నిలవాలన్న పోప్

    Oct 23, 2025
    యువతా నిరీక్షణా సంకేతాలుగా నిలవాలన్న పోప్

    అక్టోబర్ 17 శుక్రవారం మధ్యాహ్నం, పోప్ లియో రోమ్‌కు ఆగ్నేయంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీరప్రాంత పట్టణం ఓస్టియాకు ప్రయాణించారు,

    ఇది మెడిటరేనియన్ ఓడరేవు నుండి కొన్ని నెలల తరబడి పర్యటిస్తున్న ఒక నౌకాయానం అయిన Med25 Bel Espoir సిబ్బందిని కలిసారు

    ఈ నౌకలో వివిధ మతాలకు చెందిన 25 మంది యువకులు ఉన్నారు.

    Marseilleకు చెందిన కార్డినల్ Jean-Marc Aveline కూడా ఉన్నారు,

    ఓడలోని యువకులతో మాట్లాడుతూ, ద్వేషం, హింస మరియు విభజనల మధ్య "నిరీక్షణా సంకేతాలుగా " యువత నిలవాలని వారిని ప్రోత్సహించారు.

    “మనమందరం మానవులమే కాబట్టి, మనం వివిధ దేశాలు, భాషలు, సంస్కృతులు మరియు మతాల నుండి వచ్చినప్పటికీ ఐక్యంగా ఉండగలం.”అని ఇంగ్లీషులో ఆ బృందాన్ని ఉద్దేశించి పోప్ అన్నారు:

    పోప్ యువత ఇచ్చిన బహుమతులకు కృతజ్ఞతలు తెలిపారు - ఓడ చిత్రం, “మధ్యధరా తెల్ల పుస్తకం” మరియు అందరూ సంతకం చేసిన పటం

    "మీ తరం, మరియు మీలాంటి అనేక మంది యువకులు, ఈ రకమైన చొరవను ప్రోత్సహించడం కొనసాగించాలి - ఇది నిజంగా

    ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు మీలాంటి అనేక మంది యువకులను ప్రోత్సహించడం కొనసాగించాలి అని పోప్ఉద్ఘాటించారు

  • రోమ్‌లోని ఇండోనేషియా కతోలికులతో సమావేశమైన పోప్

    Sep 25, 2025
    రోమ్‌లోని ఇండోనేషియా కతోలికులతో సమావేశమైన పోప్

    సెప్టెంబర్ 22 సోమవారం రోమ్‌లో నివసిస్తున్న ఇండోనేషియా నుండి వచ్చిన కతోలికులతో పోప్ లియో సమావేశమైయ్యారు

    పోప్ ఫ్రాన్సిస్ ఈ దేశానికి చేసిన అపోస్టోలిక్ ప్రయాణం మొదటి వార్షికోత్సవం మరియు హోలీ సీ మరియు ఇండోనేషియా మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏర్పాటు చేయడం జరిగింది

    తన ప్రసంగంలో, ఆగ్నేఆసియా దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి హోలీ సీ వీరితో కలిసి నడిచిందని పోప్ గుర్తు చేసారు, ఆ సంబంధాలు గౌరవం, సంభాషణ మరియు శాంతి సామరస్యం పట్ల ఉమ్మడి నిబద్ధతపై నిర్మించబడ్డాయి అని ఆయన అన్నారు.

    దివంగత పోప్ పర్యటనలో, ముఖ్యంగా Istiqlal మసీదును సందర్శించడం, మానవాళి మంచి కోసం ఐక్యతను పెంపొందించడానికి గ్రాండ్ ఇమామ్‌తో ఉమ్మడి ఒప్పందాల పై సంతకం చేసిన సమయంలో, మతాంతర సంభాషణ ప్రముఖంగా కనిపించింది.

    "ఈ సమావేశం విశ్వాసం మరియు ఐక్యత ఫలాలకు సంకేతం" అని పోప్ లియో అన్నారు. "ఇంటి నుండి దూరంగా ఉన్నప్పటికీ, మీరు మీ శక్తివంతమైన సంప్రదాయాలను కాపాడుకుంటారు మరియు ఒకరినొకరు చూసుకుంటారు."

    ఇండోనేషియా లో ముస్లిం-మెజారిటీ కలిగిన దేశంగా పరిగణించబడుతుంది మరియు కథోలికుల జనాభా దాదాపు 3% మాత్రమే.ఐనప్పటికీ "భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారు ఆయన అన్నారు.

Daily Program

Livesteam thumbnail