FABC అసెంబ్లీకి ప్రత్యేక రాయబారిగా కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్ను పోప్ నియమించారు
FABC అసెంబ్లీకి ప్రత్యేక రాయబారిగా కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్ను పోప్ నియమించారు
జూలై 20 నుండి 26 , 2026 వరకు జకార్తాలో జరగనున్న ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్సెస్ (FABC) యొక్క 12వ ప్లీనరీ అసెంబ్లీకి, బొంబాయి అగ్రపీఠాధిపతులు ఎమెరిటస్ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్ను గారిని పరిశుద్ధ లియో XIV పాపు గారు తన ప్రత్యేక రాయబారిగా నియమించారు.
పహా పూజ్య కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్ గారు గతంలో FABC అధ్యక్షుడిగా (2010–2019) లో సేవలందించారు. ఆసియా శ్రీసభ లో ఆయనకు ఉన్న విశేష అనుభవం, నాయకత్వం దృష్ట్యా పరిశుద్ధ లియో XIV పాపు గారు ఈ బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు భావిస్తున్నారు.
పరిశుద్ధ లియో XIV పాపు గారు తన లేఖలో ఆసియాలో శ్రీసభ నిరంతరం అభివృద్ధి చెందుతూ, సువార్త సాక్ష్యానికి మరింత ఫలవంతమైన సాధనంగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీస్తు సువార్తకు ధైర్యంగా సాక్ష్యమివ్వడంలోనే కాకుండా, ప్రతి మనిషి గౌరవాన్ని పరిరక్షించి ప్రోత్సహించడంలో కూడా ఆసియా శ్రీసభ కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.
బిషప్లు, ఫాదర్ లు, దేవుని ప్రజలందరూ నేటి ప్రపంచంలోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వాస్తవాలను లోతుగా అర్థం చేసుకొని వాటితో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు.సువార్త విలువలను సమాజ జీవితంలో ప్రతిఫలింపజేస్తూ, ఆశ, ఐక్యత, మానవ గౌరవం మరియు సేవ అనే క్రైస్తవ విలువలను ధైర్యంగా ప్రకటించాలని ఆయన ప్రోత్సహించారు.
ఆసియాలో శ్రీసభ (Catholic church )భవిష్యత్ లక్ష్యాలను నిర్ధారించేందుకు ఆసియా పీఠాధిపతుల (బిషప్ల) సమావేశాల సమాఖ్య (FABC) 12వ ప్లీనరీ అసెంబ్లీ జూలై 20–26 తేదీలలో ఇండోనేషియాలోని జకార్తాలో జరగనుంది. ఈ సమావేశంలో ఆసియా నలుమూలల నుంచి పీఠాధిపతులు (బిషప్), బిషప్ల సమావేశాల ప్రతినిధులు, వాటికన్ అధికారులు, FABC కార్యదర్శులు, వేదాంతవేత్తలు, ఆధ్యాత్మిక నిపుణులు సహా 120 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.
Article and design by M Kranthi Swaroop