భక్తియుతంగా ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన

 భక్తియుతంగా ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన

విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. ఈ ప్రార్థన కూటమి సోమవారం రాత్రి  పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.  స్తుతి ఆరాధన, వాక్య పరిచర్యను  గురుశ్రీ శరగడం బాల శౌరి గారు నిర్వహించారు.

పరిశుద్ద సిలువ మార్గం ధ్యానం అనంతరం దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ, దివ్య సత్ప్రసాద మహా ఆరాధనని భక్తియుతంగా నిర్వహించారు. గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక తైల అభిషేక స్వస్థత ప్రార్దనలును నిర్వహించారు. చివరిగా  గురువులందరిచే దివ్య పూజా బలిను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గురుశ్రీ రాజేంద్ర,గురుశ్రీ బాలరాజు, గురుశ్రీ సైమన్ , గురుశ్రీ మరియాదాస్, గురుశ్రీ జయరాజు ఇతర గురువులు పాల్గొన్నారు. విచారణ సిస్టర్స్, అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ యువత ఈ రాత్రి జాగరణ ప్రార్థనలో పాల్గొన్నారు. దేవాలయంలో పాప సంకీర్తనలు మరియు స్వస్థత ప్రార్దనలు నిర్వహించారు. విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు.

విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు రాత్రి జాగరణ ప్రార్థనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer