శాంతి కోసం మరోసారి విజ్ఞప్తి చేసిన పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు.

యుద్ధంలో దెబ్బతిన్న దేశాలలో శాంతి కోసం మరోసారి  విజ్ఞప్తి చేసిన పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు.
పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, పాలస్తీనా, ఇజ్రాయెల్, సూడాన్ మరియు మయన్మార్‌లలో శాంతి కోసం మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 11న ఆదివారం ఏంజెలస్ వద్ద  ప్రార్థనల సందర్భముగా "శాంతి కోసం మనమందరం ప్రార్ధించాలని " అని మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు ప్రసంగించినట్లు వాటికన్ న్యూస్ నివేదించింది.
ఈసందర్బముగా  ఫ్రాన్సిస్ పాపు గారు రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో హిరోషిమా మరియు నాగసాకిపై అణు బాంబు దాడులను గుర్తు చేసుకున్నారు."ఆ సంఘటనల భాదితుల కోరకు మరియు అన్ని యుద్ధాల బాధితుల" కోసం ప్రార్థించమని అతను ప్రతి ఒక్కరినీ కోరారు.
చివరిగా శుక్రవారం బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన  61 మంది  కోసం  ఫ్రాన్సిస్ పాపు గారు  ప్రార్థనలు చేశారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer