ఇరాక్‌లోని యువతకు సందేశాన్ని పంపిన పోప్ లియో

ఇరాక్‌లో నాల్గవ అతిపెద్ద నగరం మరియు ఇరాకీ కుర్దిస్తాన్ రాజధానియైన Erbil ప్రాంతం ఇరాన్‌తో యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమైంది.

మార్చిలో Ankawaలోని చర్చికి చెందిన భవనాలపై డ్రోన్ దాడి జరిగింది. 'Aid to the Church in Need' ప్రకారం, 2021లో ఈ జిల్లాలో సుమారు 60,000 మంది కాల్డియన్ కతోలికులు   నివసించేవారు.

యుద్ధం వల్ల మధ్యప్రాచ్యం నుండి క్రైస్తవులు నిరంతరం వలసపోతున్నప్పటికీ, చాలామంది ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు.

ప్రతి సంవత్సరం Erbil అగ్రపీఠం వారు 'అంకావా యువతా సదస్సు'ను నిర్వహిస్తుంది. ఇక్కడ ఇరాక్ నలుమూలల నుండి యువకులు తమ అనుభవాలను పంచుకుంటారు 

అయితే, ఈ సంవత్సరం పోప్ లియో వీరికి ఒక ప్రోత్సాహ సందేశాన్ని పంపారు.

భరించలేనంతగా యుద్ధం అనే చీకటి మధ్యలో, అస్థిరతతో నిండిన ఈ పరిస్థితులలో మీరు క్రీస్తు వెలుగుగా ఉండాలి అని పోప్ పిలుపునిచ్చారు.

ఏ పనిలోనైనా మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోకండి. నేను మీతో ఉన్నాను; సంఘం మీతో ఉంది భయపడకండి అని పోప్ అన్నారు 

యేసుపై మీ నమ్మకాన్ని ఉంచండి; ప్రార్థనలో మరియు ఇతరుల మార్గదర్శకత్వం ద్వారా ఆయన మాట వినండి, మరియు ఆయన మిమ్మల్ని నడిపించడానికి అనుమతించండి.

కాల్డియన్ చర్చిలో తమ విశ్వాసాని పంచుకోవడానికి, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విచారంనల  నుండి యువత ఒకచోట చేర్చే లక్ష్యంతో 2013లో అంకావా యువత సదస్సు ప్రారంభమైంది.

పోప్ ఫ్రాన్సిస్ 2021 మార్చిలో Erbil నగరాన్ని సందర్శించినందున, ఆ పర్యటన ఇరాక్‌లోని చర్చికి ఒక మలుపుగా నిలిచింది.

Telugu Survey Popup Image