వెనిజులా భూకంప బాధితుల కొరకు ప్రార్దించిన పోప్
జూలై 5 త్రికాల ప్రార్ధన అనంతరం, పోప్ లియో స్పానిష్ భాషలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జూన్ 24న సంభవించిన వినాశకరమైన భూకంపాల వల్ల తమ వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వెనిజులా ప్రజల పట్ల తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేశారు.
రాజధాని కారకాస్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న, విపత్తుకు కేంద్రమైన La Guairaను రెండు భూకంపాలు కోలుకోలేని విధంగా ధ్వంసం చేయడంతో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
"భూకంప బాధితులను మరియు వెనిజులా ప్రజలందరినీ నా ప్రార్థనలలో స్మరించుకుంటూనే ఉన్నాను అని పోప్ అన్నారు
ఈ కష్టకాలంలో ప్రభువు వారిని ఆదుకొనుగాక."
లాటిన్ అమెరికాలో అత్యంత వినాశకరమైన విపత్తులలో ఒకటైన ఈ జంట భూకంపాల వల్ల దేశంలో ఇప్పటివరకు దాదాపు 3,000 మరణాలు నమోదయ్యాయి.
అంతర్జాతీయ సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం తమ గాలింపును క్రమంగా ముగిస్తుండగా, నిరాశ్రయులైన చాలా మంది ప్రజలు ఇప్పటికీ వీధుల్లో లేదా తాత్కాలిక ఆశ్రయాలలో ప్రమాదకరమైన పరిస్థితులలో నివసిస్తున్నారు.