ఆయుధాలు విడిచిపెట్టాలని ప్రపంచ నాయకులను కోరిన పొప్
ఆయుధాలు విడిచిపెట్టాలని ప్రపంచ నాయకులను కోరిన పొప్
ఈస్టర్ ఆదివారం నాడు, ప్రపంచ నాయకులు "ఇతరులపై ఆధిపత్యం చెలాయించకుండా, వారిని కలుసుకోవాలని" పరిశుద్ధ 14వ లియో పాపు గారు విజ్ఞప్తి చేశారు. వచ్చే శనివారం, ఏప్రిల్ 11న, సెయింట్ పీటర్స్ బసిలికాలో శాంతి కోసం తాను ఒక ప్రార్థనా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తానని కూడా ఆయన ప్రకటించారు.
ఈస్టర్ పండుగ సందర్భముగా "సెయింట్ పీటర్స్ స్క్వేర్"లో ఉన్న విశ్వాసులతో పరిశుద్ధ లియో పాపు గారు మాట్లాడుతూ, "యుద్ధాలను ప్రారంభించే శక్తి ఉన్నవారు" శాంతిని ఎంచుకోవాలని కోరారు. "ఆయుధాలు కలిగిన వారు వాటిని క్రింద పెట్టాలి అని , అని పరిశుద్ధ లియో పాపు గారు తన సాంప్రదాయ ' ఉర్బి ఎట్ ఓర్బి' సందేశంలో పిలుపునిచ్చారు.
ప్రపంచం “హింసకు అలవాటు పడుతోంది” అని, వేలాది మంది మరణాల పట్ల మాత్రమే కాకుండా, యుద్ధం కలిగించే "విద్వేషం మరియు విభజన" పట్ల కూడా "ఉదాసీనంగా మారుతున్నాము" అని ఆయన అన్నారు.
ఈస్టర్ పండుగనాడు, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణంపై విజయం సాధించారని, తద్వారా "ఈ లోకపు అధిపతియైన ఆదిమ విరోధిని శాశ్వతంగా ఓడించారని" పరిశుద్ధ లియో పాపు గారు అన్నారు. యేసు క్రీస్తు వారు ఈ విజయాన్ని సాధించిన శక్తి “పూర్తిగా అహింసాత్మకమైనది” అని, అది ప్రేమపై ఆధారపడి ఉందని పరిశుద్ధ లియో పాపు గారు నొక్కిచెప్పారు.
Article and Design By M Kranthi Swaroop