వెనిజులా భూకంప విపత్తు: ప్రార్థనలు, సంఘీభావం తెలపాలని శ్రీసభ విజ్ఞప్తి!

వెనిజులా భూకంప విపత్తు: ప్రార్థనలు, సంఘీభావం తెలపాలని శ్రీసభ విజ్ఞప్తి!

వెనిజులాలో సంభవించిన ఘోరమైన జంట భూకంపాల నేపథ్యంలో, అక్కడి కాథలిక్ చర్చి (శ్రీసభ) మరియు వెనిజులా కారిటాస్ సంస్థ అంతర్జాతీయ సమాజానికి అత్యవసర పిలుపునిచ్చాయి.

వెనిజులాలో భూకంపం సంభవించిన తొలి రోజున (జూన్ 25, గురువారం) మరణాల సంఖ్య 230 నుండి 235 వరకు ఉండవచ్చని ప్రాథమికంగా భావించారు. కానీ గత 24 గంటల్లో రెస్క్యూ టీమ్‌లు శిథిలాలను తొలగించడంతో ఈ సంఖ్య వేగంగా పెరిగింది.

వందలాది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కారకాస్ ఆర్చ్‌బిషప్ మహా పూజ్య రౌల్ బియోర్డ్ కాస్టిల్లో గారు ప్రార్థనలు మరియు సంఘీభావం కోసం పిలుపునిచ్చారు.

జూన్ 24 సాయంత్రం సంభవించిన ఈ జంట భూకంపాలు 7.2 మరియు 7.5 తీవ్రతతో నమోదయ్యాయి. గత శతాబ్ద కాలంలో వెనిజులాను తాకిన అత్యంత బలమైన భూకంపాలు ఇవే.జూన్ 25వ తేదీ మధ్యాహ్నం చివరికల్లా, 1,500 మందికి పైగా గాయపడ్డారని, మరో 200 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వార్తా నివేదికలు తెలిపాయి.

భారీ గాలింపు మరియు సహాయక చర్యలు కొనసాగుతుండగా, విపత్తు యొక్క పూర్తి స్థాయి వెలుగులోకి రావడం ప్రారంభమైన తరుణంలో, పోప్ లియో XIV, డికాస్టరీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ఛారిటీ ద్వారా 100,000 యూరోల (US$115,000) ప్రాథమిక అత్యవసర విరాళాన్ని పంపినట్లు వాటికన్ న్యూస్ నివేదించింది.

వెనిజులా చర్చి పిలుపుకు స్పందిస్తూ భారత్‌కు చెందిన CCBI సహా లాటిన్ అమెరికా, స్పెయిన్ దేశాల బిషప్‌ల మండలి తమ సంఘీభావాన్ని ప్రకటించి, సహాయక నిధులను సేకరిస్తున్నాయి.

కాన్ఫరెన్స్ అఫ్ కాథలిక్ బిషోప్స్ అఫ్ ఇండియా (CCBI) అధ్యక్షుడు మహా పూజ్య ఫిలిప్ నేరి కార్డినల్ ఫెర్రావ్ గారు వెనిజులా కి ఒక లేఖ రాస్తూ ఘోరమైన జంట భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనిజులా ప్రజలకు భారతదేశంలోని క్రైస్తవులందరి తరపున పూర్తి ఆధ్యాత్మిక మద్దతును ప్రకటించారు.

వెనెజ్వెలాలో ఎమర్జెన్సీ ని ప్రకటించారు.తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రస్తుత పరిస్థితిలో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Article and design By M Kranthi Swaroop