సూడాన్, కొలంబియా దేశాల్లో శాంతికి పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి

జనవరి 26,ఆదివారం జరిగిన త్రికాల ప్రార్థన తర్వాత, ఏప్రిల్ 2023లో సూడాన్‌లో ప్రారంభమైన  సంఘర్షణకు ముగింపు పలకాలని పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు, 

ఈ యుధం "ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభానికి కారణమవుతోందని, దక్షిణ సూడాన్‌లో కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తోందని" అన్నారు.

సూడాన్‌లో పోరాటాన్ని ఆపి శాంతి చర్చలకు మద్దతు ఇవ్వాలని ఆయన ఆహ్వానించారు.

అంతర్జాతీయ సమాజం శాంతి చర్చలకు మద్దతు ఇవ్వాలని మరియు మానవతా సహాయాన్ని సులభతరం చేయాలని పిలుపునిచ్చారు.

కొలంబియా,కాటటుంబో ప్రాంతంలో సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణల్లో అనేక మంది పౌరులు మరణించడం, 30,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళడం పట్ల పోప్ ఆందోళన వ్యక్తం చేశారు.

"నేను రెండు దేశాల ప్రజలకు తోడుగా ఉంటాను, వారిని సోదరభావంతో, సంఘీభావంతో , అన్ని రకాల హింసను ఆపివేసే దిశగా దేశాలను ఆహ్వానిస్తున్నాను" అని ఆయన అన్నారు.

Telugu Survey Popup Image