తొలి ఎన్‌సైక్లికల్‌పై సంతకం చేసిన పోప్ లియో

ప్రపంచాన్ని వేగంగా మార్చుతున్న కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) మరియు డిజిటల్ సాంకేతికతలపై కతోలిక సంఘం స్పందనలో ఒక కీలక ఘట్టంగా, పోప్ లియో తన తొలి ఎన్‌సైక్లికల్‌ను మే 25న విడుదల చేయనున్నట్లు వాటికన్ అధికారికంగా ప్రకటించింది.

“Magnifica Humanitas: On the Protection of Human Dignity in the Age of Artificial Intelligence” అనే శీర్షికతో విడుదల కానున్న ఈ పత్రం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వల్ల ఉద్భవిస్తున్న నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక సవాళ్లపై దృష్టి సారించనుంది. 

ఈ పత్రంలో మానవ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పోప్ ప్రధానంగా ఉద్దేశిస్తున్నారని సూచిస్తోంది.

ఈ ఎన్‌సైక్లికల్‌పై పోప్ లియో మే 15న సంతకం చేశారు. 

అదే రోజు, కార్మికుల హక్కులు మరియు పరిశ్రమల విప్లవం వల్ల వచ్చిన సామాజిక ప్రభావాలపై దృష్టి పెట్టిన 13 వ పోప్ లియో చారిత్రాత్మక సామాజిక ఎన్‌సైక్లికల్ Rerum Novarum విడుదలై 135 సంవత్సరాలు పూర్తయ్యాయి.

మే 25న ఉదయం 11:30 గంటలకు (రోమ్ సమయం) సినడ్ హాల్‌లో ఈ ఎన్‌సైక్లికల్ అధికారికంగా ఆవిష్కరించబడుతుంది అని వాటికన్ తెలిపారు 

ఎన్నికైన కొద్దికాలానికే కార్డినల్స్ కళాశాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, “లియో” అనే పేరును ఎంచుకోవడానికి ఒక కారణం, మొదటి పరిశ్రమల విప్లవ సమయంలో సామాజిక సమస్యలకు స్పందించిన పోప్ లియో XIIIకు గౌరవం తెలిపడమేనని వివరించారు.

కతోలిక సామాజిక బోధనల దృక్కోణంలో ఈ సమస్యలను పరిశీలించడం ద్వారా, సాంకేతిక పురోగతి మానవత్వాన్ని తగ్గించకుండా, మానవ సేవకు ఉపయోగపడేలా ఒక నైతిక మార్గదర్శకాన్ని వాటికన్ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.