సృష్టి స్వరాన్ని ఆలకిద్దామన్న పోప్ లియో
కస్తెల్ గాండోల్ఫో ఉద్యానవనాల్లో, **సృష్టి స్మరక్షణ కొరకు ప్రార్థన దినోత్సవాన్ని** పురస్కరించుకుని పోప్ లియో దివ్యబలిపూజను సమర్పించారు.
ఈ వేడుక జరిగిన ప్రదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
పాపల్ ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన **బోర్గో లౌదాతో సీ** అనే ప్రాజెక్టు వేదికగా ఈ వేడుక జరిగింది. పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించిన పర్యావరణ పరిరక్షణ వారసత్వాన్ని కొనసాగించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
శ్రీసభ ఈ రోజును ఎందుకు జరుపుకుంటుందో అర్థం చేసుకోవాలంటే… మనం 1989 సంవత్సరానికి వెళ్లాలి.
కాన్స్టాంటినోపుల్కు చెందిన ఎక్యుమెనికల్ పేట్రియార్క్ Dimitrios సెప్టెంబర్ 1వ తేదీని సృష్టి కోసం ప్రార్థన దినంగా ఆర్థడాక్స్ శ్రీసభలో పాటించాలని ప్రతిపాదించారు.
రెండు దశాబ్దాల తరువాత, పోప్ ఫ్రాన్సిస్ కూడా ఈ రోజును కతోలికుల క్యాలెండర్లో చేర్చారు.
అయితే పోప్ లియో తన సందేశాన్ని కాలుష్యం గురించి గానీ, వాతావరణ మార్పుల గణాంకాల గురించి గానీ ప్రారంభించలేదు.దానికి బదులుగా… ప్రకృతిని మనం అనుభూతి చెందడం, ఆలకించడం నేర్చుకునే మార్గదర్శిగా చూడాలని ఆయన సూచించారు.
“ప్రభువుతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించే ఈ ధ్యాన సాధన… నిజమైన ‘పర్యావరణ మార్పుకు’ తొలి అడుగు.
యేసుక్రీస్తుతో మనకు కలిగిన అనుభవం, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధంలో కూడా స్పష్టంగా కనిపించాలి.
ఈ విధంగా, మన తప్పులను, మన పొరపాట్లను గుర్తించడం ద్వారా… సృష్టికర్త చిత్తానుసారం సమస్త సృష్టితో మన సంబంధాలను పునరుద్ధరించేందుకు కొత్త నిబద్ధత మనలో ఏర్పడుతుంది.”
ఈ దివ్యబలిపూజతో **సృష్టి కాలం** ప్రారంభమవుతుంది.
ఈ కాలం అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ రోజున శ్రీసభ **అస్సీసీకి చెందిన పునీత ఫ్రాన్సిస్ 800వ వార్షికోత్సవాన్ని** స్మరించుకోనుంది.
