అల్లిపల్లి మరియతల్లి పుణ్యక్షేత్రంలో విద్యార్థులకు అధునాతన వసతులు

విద్యను అభ్యసిస్తున్న బాలబాలికల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన డార్మెంటరీ రూమ్స్, డైనింగ్ రూమ్స్‌ను ప్రారంభించారు

అల్లిపల్లి మరియతల్లి పుణ్యక్షేత్రంలో విద్యార్థులకు అధునాతన వసతులు

చింతలపూడి మండలం అల్లిపల్లి మరియతల్లి పుణ్యక్షేత్రంలో, పుణ్యక్షేత్ర డైరెక్టర్, విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మరియజోజి రాయ్ గారి ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

హాస్టల్‌లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న బాలబాలికల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన డార్మెంటరీ రూమ్స్, డైనింగ్ రూమ్స్‌ను చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు  ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర సిబ్బంది, హాస్టల్ నిర్వాహకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 ఫాదర్ మరియజోజి రాయ్ గారు  విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు, వారి ఆరోగ్యం, భద్రత, వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలమైన వసతులను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు, ఆధ్యాత్మికత, సామాజిక బాధ్యత వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి జరుగుతోంది.

“విద్యార్థులకు మంచి వసతి కల్పించడం మాత్రమే కాకుండా, వారు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలి” అనే లక్ష్యంతో సోషల్ సర్వీస్ సెంటర్ తన సేవలను కొనసాగిస్తోంది.

 

Article and Design By M Kranthi Swaroop

 

Telugu Survey Popup Image