థాయ్-కంబోడియాలో శాంతి నెలకొనాలని ప్రార్దించిన పోప్
డిసెంబర్ 10 బుధవారం, థాయ్-కంబోడియా సరిహద్దు లో ప్రారంభమైన శత్రుత్వాలను వెంటనే ముగించాలని పోప్ లియో విజ్ఞప్తి చేసారు.
ఇటీవలి ఘర్షణలు పౌరులతో సహా ప్రాణనష్టానికి కారణమయ్యాయి మరియు వేలాది మంది తమ ఇళ్లను విడిచి వెళ్ళవలసి వచ్చింది.
ఈ ప్రాంతం నుండి వెలువడుతున్న వార్తలపై పోప్ సాధారణ ప్రేక్షకుల సమావేశంలో తన "విచారం" వ్యక్తం చేశారు.
"థాయిలాండ్ మరియు కంబోడియా ప్రజలకు ప్రార్థనలో నా సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాను అని పోప్ అన్నారు
ఈ హింస దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో సాంస్కృతికంగా ముఖ్యమైన ఆలయ ప్రదేశాల చుట్టూ ఉన్న ప్రాంతాలు - రెండు దేశాల మధ్య కాలానుగుణంగా కాల్పులకు దారితీశాయి.
గతంలో మధ్యవర్తిత్వం మరియు ప్రాంతీయ దౌత్యం సరిహద్దును స్థిరీకరించడానికి ప్రయత్నించినప్పటికీ, స్థానిక సమాజాలు పదేపదే ఎదురుకాల్పుల్లో చిక్కుకుంటున్నాయి
వెంటనే కాల్పులు ఆపివేసి శాంతియుత చర్చలు తిరిగి ప్రారంభించాలని పోప్ ఇరు దేశాలను కోరారు.