పాంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్ ప్లీనరీ అసెంబ్లీ సభ్యులతో సమావేశమైన పోప్
సంఘర్షణలతో నిండిన ప్రస్తుత ప్రపంచంలో,మనిషి ప్రాణం మరియు ఆరోగ్యాన్ని కాపాడడానికి మనం వనరులను మరియు సమయాన్ని కేటాయించాలి, అదే సమయంలో ఉమ్మడి మంచి గురించి మన అవగాహనను బలోపేతం చేయడం ద్వారా అసమానతలను పరిష్కరించగలము అని ఫిబ్రవరి 16 న పోప్ లియో తెలిపారు
ఆసుపత్రులును ధ్వసం చేసే యుద్ధాలను ఎదుర్కొంటున్నాము, ఇవి మానవ జీవితాల్ని మరియు ప్రజారోగ్యంపై అత్యంత తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని వాటికన్లో పాంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్ ప్లీనరీ అసెంబ్లీలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు.
యుద్ధాలకు ఖర్చు చేసే ధనం ప్రజల ఆరోగ్య రక్షణకు వినియోగిస్తే ప్రపంచం మెరుగుపడుతుందని సూచించారు.
ఆరోగ్యం అందరి హక్కు అయినా,ధనిక–పేదల మధ్య ఎన్నో అసమానతలు ఉన్నాయని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు.
మనిషి ఆరోగ్యం- పర్యావరణం,జీవన పరిస్థితులు,విద్య, ఉపాధితో అనుసంధానమై ఉందని గుర్తుచేశారు.
ఈ సందేశాన్ని సమర్పణ జీవితం, అపోస్తలిక జీవన సంస్థల విభాగం వారు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అందించారు.