ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినోత్సవం సందర్భంగా కార్డినల్ జెర్నీ ప్రార్థనలు

ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినోత్సవం సందర్భంగా కార్డినల్ జెర్నీ ప్రార్థనలు 

34వ ప్రపంచ రోగగ్రస్తుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పరిశుద్ధ పోప్ లియో XIV  గారు  కార్డినల్ మహా పూజ్య కార్డినల్ మైఖేల్ జెర్నీని తన మాజీ పెరువియన్ డియోసెస్ ఆఫ్ చిక్లాయోకు తన ప్రత్యేక రాయబారిగా పంపారు. గతంలో ఈ మేత్రాసనంలో  పరిశుద్ధ  పోప్ లియో XIV గారు పీఠాధిపతులు గా (బిషప్‌) సేవలందించారు. ఈ ప్రాంతంలో విద్యా, ఆరోగ్య, మరియు పర్యావరణ కార్యక్రమాలను ఈ మేత్రాసనం ప్రోత్సహిస్తుంది.

ప్రపంచ రోగగ్రస్తుల దినోత్సవం ఫిబ్రవరి 11వ తేదీన ఆరోగ్య సంరక్షణ మరియు జబ్బుపడిన వారి పట్ల కనికరం చూపడానికి నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఇది అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి సంఘీభావం మరియు మద్దతు యొక్క అవసరాన్ని గుర్తు చేస్తుంది .

స్వస్థత ప్రేమ అనేది వ్యక్తిగత అనుభవం ద్వారా నడపబడాలని మహా పూజ్య కార్డినల్ మైఖేల్ జెర్నీ గారు అన్నారు. తన ప్రసంగంలో, కార్డినల్ క్జెర్నీ 2015 నుండి 2023 వరకు బిషప్‌గా పనిచేసిన చిక్లాయో డయోసిస్‌తో పరిశుద్ధ పోప్ లియో XIV గారి యొక్క ప్రత్యేక బంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ప్రపంచ అనారోగ్య దినోత్సవం కోసం పరిశుద్ధ  పోప్ సందేశం ప్రతి ఒక్కరినీ ఇతరుల బాధలను భరించమని ఆహ్వానిస్తుందని చెబుతూ, యేసు చెప్పిన మంచి సమరయుడి ఉపమానాన్ని చెప్పారు. దేవుణ్ణి ప్రేమించడం మరియు మన పొరుగువారి ఆచరణాత్మక అవసరంలో వారికి సేవ చేయడం మధ్య ఉన్న బంధాన్ని పరిశుద్ధ  పోప్ లియో సందేశం సమర్థిస్తుందని కార్డినల్ క్జెర్నీ గుర్తుచేసుకున్నారు. 

ఒక దయ యొక్క చర్య జీవితాన్ని మార్చగలదు అని కార్డినల్ క్జెర్నీ గారు అన్నారు.ఈ సందర్భముగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. 

Article and Design By M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer

 

Telugu Survey Popup Image