మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ లో వైస్ జగన్ దంపతులు

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ లో వైస్ జగన్ దంపతులు
దివంగత వైస్ రాజారెడ్డి గారి శత జయంతి సందర్భముగా YSRCP అధ్యక్షడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరియు అయన కుటుంబసభ్యులు విజయవాడ మేత్రాసనంలోని "మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ను" సందర్శించారు.
నిర్మల్ హృదయ్ భవన్లో ఆశ్రమం పొందుతున్న దివ్యాంగులు, అనాథ పిల్లలతో శ్రీ వైస్ జగన్ దంపతులు ముచ్చటించారు. పిల్లల యోగక్షేమాల గురించి అక్కడున్న సిస్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు. సిస్టర్స్ చేసిన ప్రత్యేక ప్రార్థనలలో శ్రీ వైస్ జగన్ గారు, వైస్ భారతి గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా శ్రీ వైస్ జగన్ గారికి మదర్ తెరెసా ప్రతిమను బహుమతిగా సిస్టర్స్ అందించారు.
గతంలో ఇక్కడ నూతనంగా నిర్మించిన హోహ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని వైస్ జగన్ గారు ప్రారంభించారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer