ద్వేషానికి ప్రేమతో బదులివ్వండి: పోప్ పిలుపు
ద్వేషానికి ప్రేమతో బదులివ్వండి: పోప్ పిలుపు
ఆదివారం రోజున సెయింట్ పీటర్ స్క్వేర్ ప్రార్థనలో, సువార్త ప్రచారం అనేది కేవలం పద్ధతుల వల్ల కాదు, ప్రార్థన ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తుతో ఏర్పడే వ్యక్తిగత బంధం వల్లే సాధ్యమని పరిశుద్ధ లియో XIV పాపు గారు చెప్పారు.
"మనం ఏకాంతంలో దేవుని నుండి పొందిన ప్రేమను, లోకానికి వెలుగులా పంచాలని యేసు ప్రభువుని మాటలను గుర్తు చేస్తూ పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు. మన ప్రభువైన యేసు క్రీస్తుతో మనకున్న వ్యక్తిగత అనుభవమే సువార్తకు పునాది అని, హృదయంలో దాగి ఉన్న దైవత్వాన్ని ధైర్యంగా చాటి చెప్పాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు చెప్పారు.
తొలి రోజుల్లో క్రైస్తవులు ఎదుర్కొన్న కష్టాలు, హింసల గురించే సెయింట్ మాథ్యూ (మత్తాయి)తన సువార్తలో రాశారని పోప్ గుర్తు చేశారు.
ఆదిమ క్రైస్తవులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ, నేటికీ ప్రపంచంలో చాలా మంది విశ్వాసులు అవే సవాళ్లను మరియు హింసను అనుభవిస్తున్నారని పరిశుద్ధ లియో XIV పాపు గారు ఆవేదన వ్యక్తం చేశారు."
శత్రుత్వం మరియు కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడటం, అలసిపోవడం లేదా భయపడటం సహజమని, కానీ విశ్వాసంతో వాటిని జయించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు.
క్రీస్తు యొక్క “నిరీక్షణ, ప్రేమ మరియు శాంతి” సందేశాన్ని ప్రస్తావిస్తూ, “ప్రపంచానికి ఇది చాలా అవసరం,” అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.
Article and Design BY M Kranthi Swaroop