భక్తి శ్రద్ధలతో 14 దేవాలయాలలో సిలువమార్గం

భక్తి శ్రద్ధలతో 14 దేవాలయాలలో సిలువమార్గం

ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీస్ వారి ఆద్వర్యం లో 14 దేవాలయాలలో సిలువమార్గం భక్తి శ్రద్ధలతో జరిగింది. బ్రదర్ అంతోనీ పాట్రిక్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

వివిధ విచారణాల నుండి సుమారు 200 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా యంజాల విచారణ నుండి సుమారు 60 మంది విశ్వాసులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు అమృతవాణి నుండి ఈ కార్యక్రమం మొదలైనది. 3 బస్సులలో, కార్లలో భక్తులు పాల్గొన్నారు.ప్రతి ఒక్కరు సిలువను పట్టుకొని ప్రతి దేవాలయాన్ని సందర్శించారు. ప్రతి విచారణలో ఒక్కొక స్థలం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

వివిధ విచారణ కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వాసుల కొరకు ప్రత్యేకించి ప్రార్ధించారు. అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు చివరి దివ్యపూజాబలిని సమర్పించి , విశ్వాసుల కొరకు ప్రార్ధించారు.

బ్రదర్ అంతోనీ పాట్రిక్ గారు విశ్వాసులకు ప్రేమ విందును ఏర్పాటు చేసారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer

 

Telugu Survey Popup Image