భక్తియుతంగా మొదలైన విభూది బుధవారము

భక్తియుతంగా మొదలైన విభూది బుధవారము
ఏలూరు మేత్రాసనంలోని కేథడ్రల్లో విభూది బుధవార దివ్యబలి పూజ భక్తియుతంగా జరిగింది. ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య పొలిమేర జయరావు గారు ఇతర గురువులతో కలసి దివ్యబలి పూజను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో విచారణకర్తలు గురుశ్రీ ఇంజుమలా మైఖేల్, గురుశ్రీ విద్యాసాగర్ ఇతర గురువులు, సిస్టర్స్ పాల్గొన్నారు. విశ్వాసులు అధిక సంఖ్యలో ఈ దివ్యబలి పూజ లో పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
విభూది బుధవార దివ్యబలి పూజ లో విశ్వాసుల నుదిటిపైన విభూదిని సిలువ ఆకారంలో మహా పూజ్య పొలిమేర జయరావు గారు మరియు గురువులు రాయడం జరిగింది. విశ్వాసులు ప్రభు యేసుని శ్రమలను,పాట్లను స్మరించుకుంటూ దివ్యబలిపూజలో పాల్గొన్నారు. నిర్మల యూత్ తమ సహాయాన్ని అందించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer