పాంటిఫికల్ ఎక్లెసియాస్టికల్ అకాడమీని సందర్శించిన పోప్
వాటికన్కు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న, 'నన్షియోలు' (nuncios) అని పిలువబడే ఒక ప్రత్యేక రాయబారుల బృందం ఉంది.
ఏప్రిల్ 27, సోమవారం నాడు, పోప్ లియో రోమ్లోని పొంటిఫికల్ అకాడమీని సందర్శించి, పొంటిఫికల్ దౌత్యవేతలుగా పిలువబడిన “శాంతి, సత్యం మరియు న్యాయాల సేవలో గల విశిష్ట కర్తవ్యాన్ని” పోప్ గుర్తుచేసారు
ఈ అకాడమీలో పోప్ రాయబారులు క్షుణ్ణమైన, కఠినమైన మరియు శ్రమతో కూడిన శిక్షణ పొందుతారు.
ఈ సంవత్సరం దీని స్థాపన జరిగి 325 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ అకాడమీ పోప్ లియోను కలిసారు
వారు పోప్ కు మరియు శ్రీసభ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు,కానీ వారి పాత్ర రాజకీయాలకు అతీతమైనది.
వారు శ్రీసభ మరియు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేస్తూ, మానవ గౌరవాన్ని కాపాడుతూ,క్రైస్తవ విశ్వాసానికి సాక్షులుగా నిలుస్తారు.
వారి శిక్షణ రెండు నుండి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది.
విద్యాపరమైన కఠినత్వం, దౌత్యం, ప్రేషిత కార్యం మరియు ఆధ్యాత్మికత అనే నాలుగు కీలక స్తంభాలపై ఆధారపడి వీరు శిక్షణ పొందుతారు.
ఈ సంస్థ రోమ్ నగర నడిబొడ్డున, పియాజ్జా డెల్లా మినర్వాలో ఉంది.
అక్కడ, పోప్ లియో ఒక స్మారక ఫలకాన్ని ఆవిష్కరించి, వాటికన్ రెండవ అత్యున్నత అధికారి మహా పూజ్య పీట్రో పరోలిన్తో పాటు వార్షికోత్సవ ముద్రపై సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో వాటికన్ సిటీ స్టేట్ గవర్నరేట్ అధ్యక్షురాలు Raffaella Petrini మరియు అకాడమీ అధ్యక్షులు మాన్సిగ్నోర్ Salvatore Pennacchio కూడా పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక దౌత్య గురువులను “నన్సియోస్” అని అంటారు,లాటిన్ భాషలో, nuntius అంటే “సందేశకుడు” లేదా “దూత,” అంటారు