ఫిబ్రవరి 22న బ్యాంకాక్లో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) సమావేశంలో గోవా మరియు డామావో అగ్రపీఠాధిపతులు భారతీయ కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి ఆంటోనియో సెబాస్టియో డో రోజారియో ఫెర్రో అధ్యక్షులుగా మరియు ఫిలిఫైన్స్,కలూకాన్ పీఠాధిపతులు మహా పూజ్య పాబ్లో విర్జిలియో సియోంగ్కో డేవిడ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోషల్ ఫోరమ్ వారు గుంటూరు మేత్రాసనం, మనోవికాస కేంద్రం పునీత అన్నమ్మ మానసిక వికలాంగుల పాఠశాల వారికి ఫిబ్రవరి 20,2024 న పేపర్ ప్లేట్ల తయారీ యంత్రం విరాళంగా అందించారు
బెంగళూరు, కర్ణాటక రీజినల్ ఆర్గనైసెషన్ ఫర్ సోషల్ సర్వీస్ (KROSS ) నందు భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య CBCI న్యాయ, శాంతి, అభివృద్ధి విభాగం వారు జెపిడి కార్యదర్శులకు ఫిబ్రవరి 21 -22 ,2024 రెండు రోజులపాటు సమావేశం నిర్వహించింది.
13 ఫిబ్రవరి 2024 న మైసూర్ మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య కె. అంతోని విలియమ్ గారి రాజీనామాను ఆమోదించి, బెంగుళూరు విశ్రాంత అగ్రపీఠాథిపతులు మహా పూజ్య బెర్నార్డ్ మోరస్ గారిని మైసూర్ కు అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్గా నియమించినట్లు భారత అపోస్టోలిక్ న్యూన్షియేచర్ ఒక ప్రత్యేక లేఖలో తెలియచేశారు.