భక్తియుతంగా సువార్త స్వస్థత ప్రార్ధన కూటమి

భక్తియుతంగా సువార్త స్వస్థత ప్రార్ధన కూటమి

కాకినాడ విచారణ, యేసు తిరు హృదయ దేవాలయంలో "సువార్త స్వస్థత ప్రార్ధన కూటమి" భక్తియుతంగా జరిగింది. విచారణ కర్తలు ఫాదర్ డోమినిక్ సావియో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి రెండవ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలను ఫాదర్ డోమినిక్ సావియో గారు ఏర్పాటుచేస్తున్నారు. 

ఈ ప్రార్ధన కూటమిలో  "బ్రదర్ వాడపల్లి సత్యం" గారు వాక్య పరిచర్య చేసారు. ఈ ప్రార్థన కూటమి లో అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు. బ్రదర్ వాడపల్లి సత్యం గారు  అమూల్యమైన దైవ సందేశాన్ని అందించి  విశ్వాసులను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్లారు.విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.   

ప్రార్థన కూటమికి సహాయపడిన ప్రతి ఒక్కరిని విచారణ కర్తలు  ఫాదర్ డోమినిక్ సావియో గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Article and Design: M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer