భక్తియుతంగా ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి

భక్తియుతంగా ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి

విశాఖ అతిమేత్రాసనం యర్ర సామంతవలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రం లో " ఒక్క రోజు ఉపవాస కూటమి"   పనసబద్ర నూతన దేవాలయంలో భక్తియుతంగా జరిగింది.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది. శనివారం రోజు జరిగిన ఈ  ఉపవాస ప్రార్థన కూటమిలో విశాఖ అర్బన్ డీన్ గురుశ్రీ శౌరి బాబు గారు ముఖ్య ప్రసంగీకులు గా పాల్గొననున్నారు.  

ఉపవాస ప్రార్థన కూటమిలో గురుశ్రీ మరియాదాస్, గురుశ్రీ రాయ్యప్ప , గురుశ్రీ యేసు మరియు ఇతర గురువులు పాల్గొన్నారు. విచారణ సిస్టర్స్, అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ యువత ఉపవాస ప్రార్థన కూటమిలో పాల్గొన్నారు.

ఉపవాస ప్రార్థన కూటమి లో భాగంగా ఉ 9:30 లకు జపమాల, స్తుతి ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగింది. దేవాలయంలో  పాప సంకీర్తనలు మరియు స్వస్థత ప్రార్దనలు నిర్వహించారు.

ఉదయం 11  గంటలకు విశాఖ అర్బన్ డీన్  గురుశ్రీ శౌరి బాబు గారు అమూల్యమైన దైవ సందేశాన్ని అందించారు.  అనంతరం దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ,  దివ్య సత్ప్రసాద మహా ఆరాధన జరగగా మధ్యానం 2:30 గంటలకు గురువులందరిచే  దివ్య పూజాబలి ఘనంగా జరిగింది. విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు.

గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు ప్రజలను ఆధ్యాతికంగా ముందుకు నడిపిస్తూ ప్రతి నెల రెండవ శనివారం ఈ ప్రార్థన కూటమిని నిర్వహిస్తున్నారు.  ప్రార్థనల అనంతరం ప్రజలందరికి ప్రేమ విందుని గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు  ఏర్పాటు చేసారు. ఉపవాస ప్రార్థన కూటమికి సహకరించిన ప్రతి ఒక్కరికి విచారణ గురువులు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు ధన్యవాదాలు  తెలిపారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer