నూతన దేవాలయం ప్రారంభోత్సవం

విశాఖ అతిమేత్రాసనం సబ్బవరం విచారణలో ఫాతిమా మాత నూతన దేవాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య  పొలిమేర జయరావు, D.D. గారి ఆధ్వర్యంలో నూతన దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.  

విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు  ఈ కార్యక్రమంలో పాల్గొని, మహా పూజ్య  పొలిమేర జయరావు గారితో కలసి నూతన దేవాలయ ప్రారంభోత్సవం చేసారు.

ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ డి బాలశౌరి గారు, అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు , గురుశ్రీ థామస్ పులికల్ , గురుశ్రీ జయరాజ్, అమృతవాణి డైరెక్టర్  గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు మరియు  ఇతర  గురువులు, సిస్టర్స్ , విచారణ ప్రజలు ఈ  కార్యక్రంలో  పాల్గొన్నారు. విచారణ  గాయక  బృందం మధురమైన గీతాలను ఆలపించారు.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer

 

 

Telugu Survey Popup Image