ప్రపంచంలో శాంతి కోసం ప్రార్దించండి - ఫ్రాన్సిస్ పాపు గారు

ప్రపంచంలో శాంతి కోసం ప్రార్దించండి - ఫ్రాన్సిస్ పాపు గారు   

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు  ఆరోగ్య సంరక్షణ కార్మికులకు మద్దతు మరియు గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భముగా మార్చి 31 సోమవారం ఇద్దరు సన్యాసినులు(Sisters) హత్యకు గురైన హైతీ హింసను ఖండిస్తూ, ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కూడా ఆయన పిలుపునిచ్చారు.

ఆదివారం, ఏప్రిల్ 6న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అధికారికంగా ఎలాంటి ప్రదర్శనలు ఇవ్వలేదు. అయితే, అనారోగ్యంతో ఉన్న మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికుల జూబ్లీ కోసం జరిగే   ప్రార్థనల కొరకు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆకస్మిక సందర్శన చేశారు.

సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో వేలాది మంది అస్వస్థతకు గురైన ప్రజలు మరియు వారిని చూసుకునే వారు గుమిగూడగా, వీల్‌చైర్‌లో కూర్చుని జనసమూహాన్ని పలకరిస్తూ  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఊహించని విధంగా కదలి వచ్చారు .

"మీ అందరికీ శుభ ఆదివారం, చాలా ధన్యవాదాలు!" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు బిగుసుకుపోయిన స్వరంతో వారితో అన్నారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మరియు డబుల్ న్యుమోనియా కారణంగా ఐదు వారాలకు పైగా చికిత్స తర్వాత మార్చి 23న రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.

జూబ్లీ వేడుకలకు రోమ్‌కు దాదాపు 20,000 మంది యాత్రికులు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు, వీరిలో 90 కంటే ఎక్కువ దేశాల నుండి రోగులు, వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ఫిజియోథెరపిస్టులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఉన్నారు.

ఎప్పటిలాగే, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసులను ప్రపంచంలో శాంతి కోసం ప్రార్థించమని కోరారు.

అనారోగ్యం యొక్క అనుభవం బాధాకరమైనది అయినప్పటికీ, "ప్రతిరోజూ మనం ప్రేమించడం మరియు ప్రేమించబడటం నేర్చుకునే పాఠశాలగా మారగలదని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన ఉపన్యాసంలో చెప్పారు. ఈ సందర్భముగా బలహీనులను మరియు దుర్బలులను తక్కువ చేసి చూడవద్దని, వారిని సమాజంలోని ముఖ్యమైన సభ్యులుగా స్వీకరించాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు  సమాజాన్ని కోరారు.

Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer