యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఓడిపోతారు - డాక్టర్ కె.ఎ. పాల్
యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఓడిపోతారు - డాక్టర్ కె.ఎ. పాల్
ప్రజాశాంతి పార్టీ స్థాపకులు , గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎ. పాల్ గారు శుక్రవారం న్యూఢిల్లీలో దివంగత అయతుల్లా ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి మరియు ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫథాలిని కలిసి, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 2:15 నుండి 4:00 గంటల మధ్య ఈ సమావేశం జరిగింది .
సమావేశం తర్వాత డాక్టర్ కె.ఎ. పాల్ గారు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. డాక్టర్ కె.ఎ. పాల్ గారు మాట్లాడుతూ "రాయబారి మరియు ఆయతుల్లా సమక్షంలో, మేము శాంతి కోసం పిలుపునిచ్చాము మరియు రాబోయే 72 గంటలు శాంతికి అవకాశం ఇవ్వాలని అన్ని వైపులా కోరాము. రాబోయే కొన్ని గంటల్లో నేను అమెరికా మరియు ఇజ్రాయెల్ నాయకత్వంతో సంప్రదిస్తాను అని ఆయన అన్నారు. ఈ చర్చలు ఇరాన్ వైపు నుండి శాంతి చర్చలను ప్రారంభించే దిశగా పురోగతిని సాధించాయని అయన అన్నారు.
యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఓడిపోతారు మరియు ప్రపంచంలోని ప్రతి పౌరుడు ప్రభావితమవుతాడు. శాంతియే ముందుకు సాగడానికి ఏకైక మార్గం" అని డాక్టర్ కె.ఎ. పాల్ గారు అన్నారు. శాంతి నిర్మాతలు ధన్యులు.
డాక్టర్ కె.ఎ. పాల్ గారు ప్రపంచంలో శాంతి కోసం, యుద్ధాల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని చూసి పలుమార్లు ఆయన ప్రెస్ మీట్లలో భావోద్వేగానికి లోనయ్యారు. ఒక తెలుగు క్రైస్తవుడిగా ఎక్కడ యుద్ధం లేదా దాడులు జరిగీన స్పందించే వారిలో ముందుంటారు.
డాక్టర్ కె.ఎ. పాల్ గారు 155కి పైగా దేశాలు పర్యటించి, ఇజ్రాయెల్-ఇరాన్, ఉక్రెయిన్-రష్యా వంటి ఘర్షణల మధ్య యుద్ధాలను ఆపడానికి ఆయన శాంతి ప్రయత్నాలు (Peace Initiatives) చేస్తున్నారు.
ప్రపంచ శాంతి కోసం గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI) అనే కే.ఏ. పాల్ గారు సంస్థను స్థాపించారు. "శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు".
by m kranthi Swaroop