మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫాతిమా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వరంగల్ మేత్రాసనం ఫాతిమా కథడ్రల్ లోని మహిళలందరికీ మార్చి 3,2024 న  ఉదయం 9.00గంటల నుండి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు 

పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ గోపు కమల్ గారు, విచారణ గురువు గురుశ్రీ కాసు మర్రెడ్డి గారు, గురుశ్రీ కరుణాకర్ స్జ్ గారు, సిస్టర్ ప్రభ గారు మరియు విచారణ కౌన్సిల్ సభ్యులు ప్రార్థన మరియు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.

ఉదయం 9 గంటలకు జపమాల, ఈ కార్యక్రంలో పాల్గొనే సభ్యుల నమోదు, 
వరంగల్ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ గోపు కమల్ గారిచే 10 -11 గంటలవరకు ఆధ్యాత్మిక బోధన. 
మహిళల కోసం సోలో & గ్రూప్ పాటల (భక్తి గీతాలు), కుటుంబ నిర్మాణంలో క్రైస్తవ స్త్రీ పాత్ర(బైబిల్), ప్రస్తుత సమాజంలో మహిళా సాధికారత పై 3 నుండి 4 నిమిషాల పాటు వక్తృత్వ పోటీలు జరిగాయి.

మ్యూజికల్ చైర్స్,బాంబింగ్ ద సిటీ,టగ్ ఆఫ్ వార్ మరియు వన్ మినిట్ గేమ్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 70-90 మంది మహిళలు పాల్గొన్నారు.

Tags