భారతదేశంలోని వాటికన్ రాయబారిని క్రొయేషియాకు బదిలీ చేశారు

పరిశుద్ధ పోప్ లియో XIV భారతదేశంలోని తన ప్రతినిధిని మధ్య మరియు ఆగ్నేయ ఐరోపా దేశమైన క్రొయేషియాకు బదిలీ చేశారు.

భారతదేశం మరియు నేపాల్‌కు పదవీ విరమణ చేస్తున్న అపోస్టోలిక్ నన్సియో అయిన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య  లియోపోల్డో గిరెల్లి గారు తన 73వ పుట్టినరోజు అయిన మార్చి 13న ఈ బదిలీని ప్రకటించారు.

అగ్రపీఠాధిపతులగా  మహా పూజ్య  లియోపోల్డో గిరెల్లి గారు  మార్చి 13,2021 నుండి భారతదేశంలోని శ్రీసభ కి సేవలందిస్తున్నారు.

మహా పూజ్య  లియోపోల్డో గిరెల్లి గారు  మార్చి 13,1953న ఇటలీలోని ప్రెడోర్ (బెర్గామో)లో జన్మించారు. ఆయన  జూన్ 17,1978న గురువు గా అభిషేకించబడ్డారు.   వేదాంతశాస్త్రంలో డాక్టరేట్ పట్టా కలిగి ఉన్నారు. ఆయన  జూలై 13,1987న వాటికన్ దౌత్య సేవలో ప్రవేశించారు.

తన దౌత్య సేవ సమయంలో ఆయన కామెరూన్ మరియు న్యూజిలాండ్‌లోని నన్సియేచర్‌లలో, ఆ తర్వాత వాటికన్ సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ యొక్క సాధారణ వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఆయన యునైటెడ్ స్టేట్స్‌లోని అపోస్టోలిక్ నన్సియేచర్‌లో కూడా సేవలందించారు.

2006 ఏప్రిల్ 13న, ఆయన ఇండోనేషియాకు మరియు ఆరు నెలల తర్వాత తూర్పు తైమూర్‌కు నన్సియోగా నియమించబడ్డారు. 2011 జనవరి 13న, ఆయన సింగపూర్, మలేషియా మరియు బ్రూనైలకు వాటికన్ ప్రతినిధిగా మరియు వియత్నాంకు నివాసేతర పోంటిఫికల్ ప్రతినిధిగా నియమించబడ్డారు.

2017 సెప్టెంబర్ 13న, ఆయన ఇజ్రాయెల్‌కు నన్సియోగా మరియు జెరూసలేం, పాలస్తీనాలకు అపోస్టోలిక్ ప్రతినిధిగా నియమితులయ్యారు. రెండు రోజుల తర్వాత, ఆయన సైప్రస్‌కు కూడా నన్సియోగా నియమితులయ్యారు. 

 

Article and design by M Kranthi Swaroop