గురుశ్రీ పొలమరిశెట్టి మరియదాసు గారికి డాక్టరేట్‌

గురుశ్రీ పొలమరిశెట్టి మరియదాసు గారికి డాక్టరేట్‌

విశాఖ అతిమేత్రాసనం, యానాం విచారణకర్తలు గురుశ్రీ పొలమరిశెట్టి మరియదాసు గారికి విశాఖప ట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. 'విపత్తుల నిర్వహణ, ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు తోడ్పడే అంశాల' పై పరిశోధన చేసి గురుశ్రీ పొలమరిశెట్టి మరియదాసు గారు  సమర్పించిన పరిశోధనాపత్రాలకు గాను డాక్టరేట్ లభించింది.

గురుశ్రీ పొలమరిశెట్టి మరియదాసు గారు గతంలో అమృతవాణి డైరెక్టర్ గా, అడ్మినిస్ట్రేటర్ గా మరియు "రేడియో వెరితాస్ ఆసియ తెలుగు" విభాగ కోఆర్డినేటర్ గా అమూల్యమైన సేవలందించారు. దివ్యవాణి అడ్మినిస్ట్రేటర్ గా కూడా తన సేవలందించారు.  

డాక్టరేట్ స్వీకరించిన సందర్భంగా గురుశ్రీ పొలమరిశెట్టి మరియదాసు గారికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం నుండి హృదయపూర్వక అభినందనలు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer