AICU విశాఖపట్నం శాఖ కార్యాలయ ప్రారంభోత్సవం

ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్  (AICU) విశాఖపట్నం శాఖ కార్యాలయ ప్రారంభోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, మహారాణి పేటలో ఉన్న పాస్టరల్ సెంటర్ భవనంలో 'ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్' విశాఖపట్నం శాఖ నూతన కార్యాలయం ఆఫీస్ ప్రారంభోత్సవం ఘనంగా  జరిగింది.

మంగళవారం (18-06-2024 ) సాయంత్రం జరిగిన  ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విశాఖ అతిమేత్రాసన అపోస్తిలిక పాలన ఆధికారి మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి  విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ  దుగ్గంపూడి బాలశౌరి గారు, టి.సి.బి.సి. లేయిటి కమిషన్ కార్యదర్శి గురుశ్రీ  ఎమ్. ప్రతాప్ కుమార్ అతిధులుగా విచ్చేశారు.

 ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ (AICU) జాతీయ కార్యదర్శి శ్రీ  'స్వామినాథం', ఏఐసీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బిచ్చపోగు రవికుమార్, ఏఐసీయూ విశాఖ శాఖ అధ్యక్షులు శ్రీ 'బూర రవీంద్ర శేషుబాబు,  కార్యదర్శి శ్రీ  బేతా జోసఫ్,  శ్రీ పాత్రపల్లి సునీల్ కుమార్  తదితరులు హాజరయ్యారు.

AICU  యొక్క ఘనమైన చరిత్రను, సంఘ కార్యకలాపాలను, ఉన్నతిని ప్రగతిని గురించి రవికుమార్ గారు  సభ్యులకు వివరించారు. శ్రీ రవీంద్ర శేషు బాబు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి  పెద్ద సంఖ్యలో కథోలిక  క్రైస్తవులు హాజరయ్యారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer