వరంగల్ మేత్రాసనంలో ఫాతిమామాత తిరునాళ్లు

వరంగల్ మేత్రాసనం,ఫాతిమానగర్, ఫాతిమా కథడ్రల్ నందు ,మార్చి 3,2024 న ఫాతిమామాత  పండుగ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.

వరంగల్ మేత్రానులు మహా పూజ్య ఉడుమల బాల గారు ఫాతిమామాత పతాక ఆవిష్కరణ  చేశారు. గురుశ్రీ  కాసు మర్రెడ్డి విచారణ కర్తలు , గురుశ్రీ కరుణాకర్ SJ సహాయక గురువు ఇతర గురువులతో కలిసి దివ్యబలి పూజను సమర్పించారు.

కథడ్రల్ చుట్టూ దివ్య సత్ప్రసాదంతో కొవ్వొత్తులతో ఊరేగింపు జరిగింది. 

3 మార్చి 2024 నుండి 12 మార్చి 2024 వరకు జరిగే ఈ తిరునాళ్ళు విజయవంతం కావాలని 216 గంటల పాటు దివ్యసత్ప్రసాద ఆరాధన ప్రారంభించారు.