యూరోపియన్ యూనియన్ కు రాయబారిని నియమించిన పోప్ ఫ్రాన్సిస్

యూరోపియన్ యూనియన్ కు నూతన పోపు గారి రాయబారిగా మహా పూజ్య ప్ బెర్నాడిటో అవుజాను మార్చి 22, 2025 న పొప్ ఫ్రాన్సిస్ నియమించారు.

ఆగస్టు 2024లో మరణించిన మహా పూజ్య నోయెల్ ట్రెనర్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు.

అక్టోబర్ 1, 2019 నుండి, అవుజా స్పెయిన్ రాజ్యానికి మరియు అండోరా ప్రిన్సిపాలిటీకి, యన న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి పోపు గారి రాయబారిగా పనిచేశారు.

జూలై 2014 నుండి సెప్టెంబర్ 2019 వరకు వాషింగ్టన్, డి.సి.లోని ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ (OAS) కు హోలీ సీ శాశ్వత పరిశీలకుడిగా కూడా ఉన్నారు.

ఐక్యరాజ్యసమితికి శాశ్వత ప్రతినిధిగా తన సేవల కాలంలో, ఆర్చ్ బిషప్ ఆజా సెప్టెంబర్ 25, 2015న పోప్ ఫ్రాన్సిస్‌ను ఐక్యరాజ్యసమితికి స్వాగతించారు మరియు వివిధ అంతర్జాతీయ పత్రాలను స్వీకరించడానికి దారితీసిన చర్చలలో పాల్గొన్నారు.

ఆయన పదవీకాలంలో, హోలీ సీ మిషన్ ఐక్యరాజ్యసమితిలో సంవత్సరానికి సగటున 20 సమావేశాలను నిర్వహించింది.

మహా పూజ్య ఆజా ఫిలిప్పీన్స్‌లోని Talibonకు చెందినవారు. జూన్ 1985లో Tagbilaran మేత్రాసన గురువుగా అభిషేకింపబడ్డారు.

రోమ్‌లో వేదాంతశాస్త్రంలో డాక్టరేట్ పొందారు,1990లో హోలీ సీ దౌత్య సేవలో ప్రవేశించారు,తర్వాత వాటికన్‌లోని సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో అనేక సంవత్సరాలు పనిచేశారు.