ప్రపంచ శాంతికి హాని కలిగించే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” -ICMICA

ప్రపంచ శాంతికి హాని కలిగించే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” -ICMICA

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని కతోలిక సమూహాల కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

హింసను పెంచే, ప్రాంతీయ ఉద్రిక్తతలను రాజేసే మరియు ప్రపంచ శాంతికి ప్రమాదం కలిగించే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు "ICMICA"(ఇంటర్నేషనల్ కాథలిక్ మూవ్‌మెంట్ ఫర్ ఇంటలెక్చువల్ అండ్ కల్చరల్ అఫైర్స్) తెలిపింది.

ఇందులో దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండియా (ICMICA చెన్నై), శ్రీలంక మరియు ఆస్ట్రేలియాకు చెందిన కాథలిక్ గురువులు నాయకులు మరియు నిపుణుల సంఘాలు ఉన్నాయి.

"ఉగ్రవాదాన్ని వెంటనే తగ్గించడం, ఇరుదేశాలు సంయమనం పాటించడం మరియు దౌత్యానికి తిరిగి రావాలని UN సెక్రటరీ జనరల్ చేసిన విజ్ఞప్తిని మేము ప్రతిధ్వనిస్తాము" అని ICMICA తెలిపింది.

దక్షిణ ఇరాన్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిలో చిన్నారులు సహా కనీసం 153 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు.ఈ ఘటనకు అమెరికా, ఇజ్రాయెలే బాధ్యులని ఇరాన్ ఆరోపించింది.

దాదాపు 37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో మరణించారు. ఈ దాడిలో ఖమేనీ కుటుంబ సభ్యులు, పలువురు ఇరాన్ నాయకులు కూడా మరణించారు.

మరోవైపు ఇరాన్ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్ లను, యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది . అలాగే అమెరికా సంస్థలకు చెందిన ఆస్తులపై కూడా దాడులు చేస్తోంది.

"ఇరాన్ మరియు ఈ ప్రాంతం అంతటా ప్రభావితమైన పౌరులందరికీ, ముఖ్యంగా యుద్ధం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు , పేదలు, స్థానభ్రంశం చెందిన మహిళలు, పిల్లలు, వలస కార్మికులు మరియు మతపరమైన మైనారిటీలకు" ఈ గ్రూపులు సంఘీభావం తెలిపాయి.

1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో ఇప్పటివరకు ఇద్దరు సుప్రీం లీడర్లు మాత్రమే ఉన్నారు. అయతొల్లా రుహొల్లా ఖొమేనీ, అయతొల్లా అలీ ఖమేనీ.

Article and Design By M. Kranthi Swaroop