దేవుడిపై భారం వేసి, నేను నమ్మకంతో నిలబడ్డాను - సంజూ శామ్సన్

దేవుడిపై భారం వేసి, నేను నమ్మకంతో నిలబడ్డాను - సంజూ శామ్సన్

తనపై తాను సందేహాలు కలిగిన సమయంలో కూడాదేవునిపై ఉంచిన విశ్వాసమే తనను ముందుకు నడిపించిందని, దేవుని దయ వల్లే తనకు ఈ విజయం దక్కిందని సంజూ శామ్సన్ కృతజ్ఞత తెలుపుకున్నారు.

భారత క్రికెట్‌లో సంజూ శామ్‌సన్‌కు కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొన్నాడు.అయితే నిన్న జరిగీన విండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం ఈ కేరళ స్టార్‌ అదరగొట్టాడు. దూకుడుగా ఆడిన సంజూ శామ్సన్ 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. 4 సిక్సర్లు, 12 ఫోర్లతో చెలరేగి ఆడాడు. జట్టు ఓటమి అంచుల నుంచి విజయ పథానికి నడిపించిన హీరో సంజూ శామ్‌సన్‌. చివరికి బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. అయితే మ్యాచ్ గెలిపించిన సంజు, తన ఆరాధ్య దైవం అయినా యేసు క్రీస్తు ప్రభువును ప్రార్ధించి కృతజ్ఞతలు తెలిపాడు.

గతంలో 2025 వన్డే వరల్డ్ కప్ మహిళల టోర్నమెంట్ సందర్భంగా సెమీఫైనల్స్ లో జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) కూడా టీమ్ ఇండియన్ గెలిపించి దేవునికి కృతజ్ఞతలు తెలిపింది.

 

Article and design by M Kranthi Swaroop