భక్తియుతంగా ఒకరోజు ప్రార్థన సమావేశం

భక్తియుతంగా ఒకరోజు ప్రార్థన సమావేశం

విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం లో ఒకరోజు ప్రార్థన సమావేశం భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  

ఆదివారం జరిగినటువంటి ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా  గురుశ్రీ సరిస ప్రతాప్ గారు పాల్గొన్నారు. గురుశ్రీ సరిస ప్రతాప్ గారు ఆరాధన మరియు  అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. గురుశ్రీ సంతోష్ CMF మరియు  గురుశ్రీ జాన్ CMF గార్లతో కలసి గురుశ్రీ సరిస ప్రతాప్ గారు దివ్య బలిపూజను సమర్పించారు.

అధికసంఖ్యలో విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఈ దివ్య బలిపూజలో పాల్గొన్నారు.విచారణ గాయక బృదం మధురమైన గీతాలను ఆలపించారు.

గురుశ్రీ సంతోష్ గారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer