ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు

ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు

విజయవాడ మేత్రాసనం, ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో "సెమి క్రిస్మస్ వేడుకలు - 2025" ఘనంగా జరిగాయి. యువత మార్గచుపరి, ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జోజి తంబి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ వేడుకలకు  ముఖ్యఅతిథిగా విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారు పాల్గొని అమూల్యమైన క్రిస్మస్ సందేశాన్ని విశ్వాసులకు అందించారు.
అధికసంఖ్యలో  గురువులు ,కన్య స్త్రీలు  మరియు యువతీ యువకులు ఈ   "సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. 

ఆటలపోటీలలో గెలుపొందిన వారికీ మొమెంటోస్ అందించారు.  వివిధ విచారణాల నుండి పాల్గొన్న యువతీ యువకులు క్రిస్మస్ గీతాలను ఆలపించారు.  వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో యువత చురుకుగా పాల్గొన్నారు. ఆధ్యంతం కన్నుల పండుగగా ఈ సెమి క్రిస్మస్  వేడుకలు జరిగాయి. 

 

Article by M Kranthi Swaroop