‘ది చోసెన్ ’ ను మేత్రాసనాలలో ప్రోత్సహించాలి

‘ది చోసెన్ ’ ను మేత్రాసనాలలో ప్రోత్సహించాలి 

మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని జీవితం  ఆధారంగా నిర్మితమైన ‘ది చోసెన్ ’ (The Chosen) వివిధ మేత్రాసనలో  విస్తరించేందుకు ఒక ప్రతిపాదనను "ది చొసెన్ ఇన్ ఇండియా ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌" శ్రీ అజిన్ జోసెఫ్‌ గారు తెలుగు కతోలిక పీఠాధిపతులకు పరిచయం చేశారు.  

మార్చి 4న హైదరాబాద్‌లోని భక్త యోహాను ప్రాంతీయ గురు విద్యాలయంలో  జరిగిన తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (TCBC) సమావేశంలో ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చారు. 

శ్రీ అజిన్ జోసెఫ్  మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మేత్రాసనాలలో  “The Chosen Encounter” మరియు “Tell Everyone” అనే కార్యక్రమాలను నిర్వహించే  కార్యక్రమాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో  "తెలుగు ప్రాంతీయ విభాగం" లో  ‘ది చోసెన్ ’  సిరీస్‌ను అనుసంధానించే బాధ్యతను నిర్వహిస్తున్న TCBC సమన్వయకర్త శ్రీ మెరుగు ప్రశాంత్ కూడా పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు  ఈ ప్రతిపాదనను స్వాగతించారు.   హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల అంతోనీ  గారు పీఠాధిపతులను తమ తమ మేత్రాసనాలలో ద చోసెన్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రోత్సహించారు.

"ది ఛోసెన్" (The Chosen) అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని జీవితం మరియు అయన పరిచర్యను వర్ణించే ఏడు సీజన్ల టెలివిజన్ సిరీస్.ఈ సిరీస్ పలు భారతీయ భాషల్లో అందుబాటులో , ది చోసెన్ టీవీ ప్లాట్‌ఫామ్ మరియు మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు.

by m kranthi swaroop