మధ్యప్రాచ్యంలో బాధితులకు సంతాపం తెలిపిన పోప్ లియో
మధ్యప్రాచ్యంలో బాంబు దాడుల బాధితులకు, ముఖ్యంగా పిల్లలకు మరియు లెబనాన్లో మరణించిన Maronite గురువు పియరీ ఎల్-రహి కి తన విచారాన్ని పోప్ లియో వ్యక్తం చేశారు.
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ సోమవారం మార్చి 9 న ఒక ప్రకటన విడుదల చేస్తూ, పోప్ లియో మధ్యప్రాచ్యంలో విద్వాంసాలు నిలిపివేయాలని ప్రార్థిస్తున్నట్లు నివేదించింది
పిల్లలు, అమాయకుల,మరిముఖ్యంగా మరణించిన ఫాదర్ Pierre El-Rahi. కొరకు పోప్ తన విచారాన్ని వ్యక్తం చేశారు.
“ఈ రోజుల్లో మధ్యప్రాచ్యంలో జరిగిన బాంబు దాడుల బాధితులందరికీ, పిల్లలతో సహా అనేక మంది అమాయకులకు మరియు వారికి సహాయం చేస్తున్న వారికి, ఈ మధ్యాహ్నం Qlayaa లో చంపబడిన మారోనైట్ గురువు పియరీ ఎల్-రహి వంటి వారికి పోప్ లియో విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు” అని ప్రకటన పేర్కొంది
“అతను ఏమి జరుగుతుందో ఆందోళనతో అనుసరిస్తున్నాడు మరియు ప్రతి శత్రుత్వం వీలైనంత త్వరగా ఆగిపోవాలని ప్రార్థిస్తున్నాడు.”
లెబనాన్లోని క్లాయాలో సోమవారం ఇజ్రాయెల్ ట్యాంక్ కాల్పులకు గురైన విచారణ వాసులకు సహాయం చేయడానికి ప్రయత్నించే మెరోనైట్ గురువు హత్యకు గురయ్యారని లెబనీస్ మీడియా నివేదికలు తెలిపాయి.
అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఫాదర్ గాయాలతో మరణించారు.