పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు AIపై జరిగే G7 చర్చలో పాల్గొననున్నారు

పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు AIపై జరిగే G7 చర్చలో పాల్గొననున్నారు

జూన్ నెలలో దక్షిణ ఇటలీలో ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక దేశాల నాయకులు పాల్గొంటున్న  "కృత్రిమ మేధస్సు"పై G7 చర్చలో ఫ్రాన్సీస్ జగద్గురువులు పాల్గొంటారని ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు.

"గ్రూప్ ఆఫ్ సెవెన్ యొక్క పనిలో ఫ్రాన్సీస్ జగద్గురువులు పాల్గొనడం ఇదే మొదటిసారి మరియు ఇది ఇటలీకి మరియు మొత్తం @G7కి మాత్రమే ప్రతిష్టను తెస్తుంది" అని మెలోని  ఏప్రిల్ 26న వీడియో ప్రకటన తెలిపారు.వాటికన్ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మాటియో బ్రూనీ,  ఫ్రాన్సీస్ జగద్గురువులు పాల్గొనాలనే ఉద్దేశ్యాన్ని ధృవీకరించారు.కృత్రిమ మేధస్సును "మన కాలపు గొప్ప మానవ శాస్త్ర సవాలు" అని మెలోని గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇటాలియన్ ప్రధాన మంత్రి  జార్జియా మెలోని, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మరియు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ నాయకులు, యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులతో కలిసి  ఫ్రాన్సీస్ జగద్గురువులు జూన్ 13-15 తేదీలలో పుగ్లియాలోని బోర్గో ఎగ్నాజియాలో సమావేశం కానున్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer