యువతకు మార్గనిర్దేశం చేసిన కర్నూల్ మేత్రాసనం
యువతకు మార్గనిర్దేశం చేసిన కర్నూల్ మేత్రాసనం
కర్నూలు మేత్రాసనంలో మూడు రోజుల పాటు యువతకు కెరియర్ మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహించింది. కర్నూల్ లోని జీవసుధ పాస్టరల్ సెంటర్లో ఏప్రిల్ 9 నుంచి 11 వరకు జరిగిన ఈ కార్యక్రమం “మీ ప్రతిభను గుర్తించండి – మీ భవిష్యత్తును నిర్మించండి” అనే అంశంపై జరిగింది.
ఈ కార్యక్రమంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలోని 66 విచారణల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.
కర్నూలు మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య జోహన్నెస్ గొరంట్ల, OCD గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించి, ఈ దశలో విద్యార్థులు ఎదుర్కొనే ఆందోళనలను ప్రస్తావించారు. విద్యార్థులు మంచి భవిష్యత్తును నిర్మించుకోవడంలో అవసరమైన అంశాలను తెలిపారు .
శ్రీమతి దీప్తి గారు 10వ తరగతి తర్వాత ఉన్న అవకాశాలను వివరించారు .శ్రీ జ్ఞాన జోసెఫ్ గారు ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్, ఇంజనీరింగ్, ఏరోనాటిక్స్ వంటి రంగాలలో అవకాశాలను వివరించారు.డాక్టర్ సుహాషిణి గారు ఆరోగ్యరంగంలో ఉన్న అవకాశాలను వివరించి, బాధ్యతతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.శ్రీ రాజశేఖర్ గారు మాట్లాడుతూ వినయం కలిగి జీవించాలని , జీవితంలో స్పష్టత కలిగి ఉండాలని అన్నారు
రెండవ రోజు RVA బృందం పాల్గొని మీడియా సపోర్ట్ ను అందించింది . అమృతవాణి మరియు RVA సిబ్బంది బైబిల్ క్విజ్ ను నిర్వహించారు . జీసస్ యూత్ సినియర్ ప్రశాంత్ మరియు రాజు పాల్గొని కృషి, క్రమశిక్షణ, ప్రార్థన ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు .
నిజమైన పేద విద్యార్థులకు కర్నూలు మేత్రాసన సహాయం ఎప్పుడు ఉంటుందని మహా పూజ్య జోహన్నెస్ గొరంట్ల, OCD గారు నొక్కి చెప్పారు . విద్యార్థులు దేవుని మార్గంలో విశ్వాసం మరియు పట్టుదలతో ముందుకు సాగాలని , విలువలకు అనుగుణంగా జీవించాలని మహా పూజ్య జోహన్నెస్ గొరంట్ల, OCD గారు గారు ప్రోత్సహించారు.
Article and Design By M Kranthi Swaroop