తురాలోని విశ్రాంత పీఠాధిపతి మహా పూజ్య జార్జ్ మమలస్సేరి కన్నుమూత

 మహా పూజ్య జార్జ్ మమలస్సేరి

తురాలోని విశ్రాంత పీఠాధిపతి మహా పూజ్య జార్జ్ మమలస్సేరి కన్నుమూత.

తురాలోని విశ్రాంత పీఠాధిపతి మహా పూజ్య జార్జ్ మమలస్సేరి జులై 5, 2024న తెల్లవారుజామున 2:20 గంటలకు తీవ్ర శ్వాసకోశ సమస్యల కారణంగా ఈశాన్య భారతదేశంలోని తురా, మేఘాలయలోని హోలీ క్రాస్ హాస్పిటల్‌లో కన్నుమూశారు.

గత కొన్ని నెలలుగా ఆయన ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోవడంతో చికిత్స పొందుతున్నారు. ఆయన 28 సంవత్సరాలు (1979-2007) మేఘాలయలోని తురా మేత్రాసనానికి మొదటి పీఠాధిపతిగా సేవలందించారు.

దక్షిణ భారతదేశంలోని కేరళలోని కలత్తూర్‌లో ఏప్రిల్ 23, 1932న జన్మించిన మామలస్సేరి, కురియన్ మరియు ఎలిజబెత్ మమలస్సేరి దంపతులకు ముగ్గురు పిల్లలలో చిన్నవాడు

12 సంవత్సరాల వయస్సులో అనాథ అయిన ఆయన 1950 నుండి 1960 వరకు తన చదువును పూర్తి చేసి, మద్రాసు-మైలాపూర్ మేత్రాసనం కొరకు పూనమల్లిలోని సేక్రేడ్ హార్ట్ సెమినరీలో చేరారు.

దైవ సేవలో గల మక్కువతో ఆయన ఈశాన్య ప్రాంతంలో సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఏప్రిల్ 24, 1960న బిషప్ లూయిస్ మాథియాస్ ఆయనకు నియమితులయ్యారు.

తురా మరియు బగ్మారాలో ఒక దశాబ్దం పాటు సహాయక విచారణ గురువుగా పనిచేసిన తరువాత, అతను 1970లో డాలు యొక్క విచారణ గురువుగా నియమితులైయ్యారు. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో, ఆయన తన విచారణలో యుద్ధ శరణార్ధులకు  ఆశ్రయం, ఆహారం మరియు సహాయాన్ని అందించారు.

ఫిబ్రవరి 8, 1979న, 46 సంవత్సరాల వయస్సులో  ఆయన మామలస్సేరికి మొదటి పీఠాధిపతిగా మార్చి 18, 1979న నియమితులయ్యారు.