ఏలూరు మేత్రాసన సమాచార కేంద్ర ప్రారంభోత్సవం

ఏలూరు పీఠం, జేవియర్ నగర్, బిషప్స్  క్యాంపస్, పాస్టరల్ అనిమేషన్ సెంటర్ నందు జూలై 25 ,2024 న దివ్యవాణి TV మేత్రాసన సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఈ ప్రారంబోత్సవానికి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల ఆంతోని తండ్రి గారు, ఖమ్మం పీఠాధిపతులు మహా పూజ్య సగిలి ప్రకాష్ తండ్రి గారు, నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య కరణం ధమన్ కుమార్ తండ్రి గారు ముఖ్య అతిధులుగా విచ్చేయగా, ఏలూరు మేత్రాసన సమాచార కేంద్ర డైరెక్టర్ గురుశ్రీ ఇమ్మానుయేల్ గారు, దివ్యవాణి TV CEO గురుశ్రీ లూర్దురాజు గారు, అమృతవాణి  డైరెక్టర్, రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగ కోఆర్డినేటర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు  మరియు మేత్రాసన గురువులు,మఠవాసులు విశ్వాసులు పాల్గొన్నారు.

కార్డినల్ పూల ఆంతోని తండ్రిగారు 11 వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మహా పూజ్య పొలిమేర జయరావు తండ్రిగారికి అభినందించి, దివ్యవాణి టీవీ సమాచార మాధ్యమాన్ని, స్థానిక సమాచార మాధ్యమాలను  కూడా ప్రోత్సహించాలని పీఠాధిపతులను మరియు గురువులను విన్నవించారు.

ఏలూరు పీఠాధిపతులు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసి, ఆశీర్వదించిన కార్డినల్ గారికి, ఇతర పీఠాధిపతులకు, గురువులకు, మఠవాసులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సమాచార కేంద్ర అభివృద్ధికి గురువుల, విశ్వాసుల మద్దతును కోరారు.