ఆల్-ఇండియా కాథలిక్ యూనివర్శిటీ ఫెడరేషన్ (AICUF) శతాబ్ది వేడుకలు

తమిళనాడు,తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసఫ్ కళాశాలలో మే 24-27 తేదీలలో ఆల్-ఇండియా కాథలిక్ యూనివర్శిటీ ఫెడరేషన్ (AICUF) శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి.

భారతదేశం నలుమూలల అనగా జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు నుండి సుమారు 300 మందికి పైగా AICUF సభ్యులు, యానిమేటర్లు మరియు సలహాదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకలో AICUF సభ్యులు తమ నాయకత్వ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి, ఇతర సంస్కృతులపై వారి దృక్కోణాలను విస్తృతం చేయడానికి మరియు సామాజిక సేవ మరియు వ్యక్తిగత అభివృద్ధికి వారి అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి సహాయపడే వివిధ కార్యకలాపాలను అందించాయి.

జెస్యూట్ కాన్ఫరెన్స్ ఆఫ్ సౌత్ ఆసియా అధ్యక్షుడు గురుశ్రీ స్టానిస్లాస్ డిసౌజా సంస్థ శతాబ్ది వేడుకను పురస్కరించుకుని మే 24న అధికారిక AICUF గీతాన్ని విడుదల చేశారు. 

షెడ్యూల్‌లో ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక, పర్యావరణ మరియు ఆర్థిక సమస్యలను వివరించే అనేక విద్యా సదస్సులు ఉన్నాయి.

శతాబ్ది వేడుకలు హాజరైన వారి వ్యక్తిగత అభివృద్ధి మరియు స్వచ్ఛంద సేవను కొనసాగించమని ప్రోత్సహించారు

AICUF అనేది కాథలిక్ విశ్వవిద్యాలయ విద్యార్థుల సంస్థ మరియు దీనిని 1924లో జెస్యూట్ ఫాదర్ కార్టీ ప్రారంభించారు. ప్రస్తుతం, ఇది భారతదేశంలోని 15 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. 

ఈ సంస్థ కాథలిక్ నిపుణుల అంతర్జాతీయ సంఘం అయిన పాక్స్-రొమానాతో అనుబంధంగా ఉంది.

"సామాజిక సమస్యలు మరియు అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి విద్యార్థులను చైతన్యవంతులను చేయడం లక్ష్యం" అని AICUF యొక్క మిషన్ స్టేట్‌మెంట్.