Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
పునీత మదర్ థెరిసా
పునీత మదర్ థెరిసా
ఆమె భారతీయురాలు కాదు, కానీ ఆమె తన జీవితమంతా భారతదేశ ప్రజలకు సేవ చేయడంలో గడిపింది. పేద, నిస్సహాయ ప్రజలకు ఆమె నిస్వార్థమైన సేవ చేసింది.
ఆమె ప్రపంచానికి ఒక ప్రేరణ - "వినయం, దయ మరియు దాతృత్వం" యొక్క పరిపూర్ణ మిశ్రమం ఆమె.
ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా. 1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ.
ఆమె భారతదేశానికి వచ్చి 1950లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించింది. కోల్కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. కోల్కతా వీధుల్లో జోలెపట్టి చాలామంది కడుపు నింపారు.
కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటురోగాలు సోకినవారికి, బాధితులు, శరణార్థులు, అంధులు, దివ్యాంగులు, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు.ఆమె సేవలకు గాను 1979లో అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక, భారత అత్యున్నత పౌర పురస్కారం 1980లో భారతరత్న ఆమెను వరించింది.మదర్ థెరీసాకు సెయింట్హుడ్ హోదా కూడా దక్కింది.
మదర్ థెరిసా తన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, మిషనరీస్ ఆఫ్ ఛారిటీని మరియు దాని శాఖలను మునుపటిలాగే సమర్ధవంతంగా పరిపాలించారు. ఏప్రిల్ 1996లో, మదర్ థెరిసా కిందపడి ఆమె కాలర్ బోన్ విరిగింది. ఆ తర్వాత, తల్లి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది మరియు సెప్టెంబర్ 5, 1997న ఆమె స్వర్గలోకానికి వెళ్లిపోయింది.
మదర్ థెరిసా మానవాళిలో మంచిని విశ్వసించారు. “మనమందరం గొప్ప పనులు చేయలేము. కానీ మనం చాలా ప్రేమతో చిన్న చిన్న పనులు చేయగలం అన్నది ఆమె సిద్ధాంతం.
Add new comment